
ఆపరేషన్ సిందూర్తో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత ఆర్మీ ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడడం, పాత వీడియోలతో అసత్య ప్రచారం చేయడం వంటి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. అయితే ఎప్పటికప్పుడు పాక్కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది.మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దాటి చొరబాటుకు యత్నించింది. అయితే వారి ప్రయత్నాలను భారత సరిహద్దు భద్రతా దళం (BSF) భగ్నం చేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో వైమానిక దాడుల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనగర్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోని తదితర ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ (Pakistan) భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకురావడం కనిపించింది. ఆ డ్రోన్లు ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్ వైపు దూసుకొచ్చాయి. అయితే డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సుమారు 50 పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేసింది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది.