
బ్యాంక్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
అయితే తిరుమలరావు కొన్నాళ్లుగా ఐశ్వర్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అయితే పెళ్లై ఎనిమిదేళ్లు గడుస్తున్నా తమకు పిల్లలు లేకవడంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతో కలిసి వెళ్లిపోయిఅమెతోనే పిల్లలను కనాలని తిరుమలరావు భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్తతో పాటు తన భార్యను కూడా హత్య చేసేందుకు కుట్రపన్నాడు.అయితే మొదట భార్యను హత్య చేయాలనుకన్న తిరుమలరావు ఆమెను హత్య చేస్తే బంధువుల్లో తనకున్న పేరు పోతుందనే భయంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.తర్వాత ప్రియురాలి ఐశ్వర్యతో మాట్లాడి ఆమె భర్త హత్యకు ప్లాన్ చేశాడు.అయితే తేజేశ్వర్ హత్యకు ముందు రోజు తిరుమల రావు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు.అందులోంచి రూ.2లక్షలను సుపారీ గ్యాంగ్కు ముట్టచెప్పాడు. దీంతో డబ్బులు అందుకున్న సుఫారీ గ్యాంగ్ తేజేశ్వర్ను హత్య చేసి.. మృతదేహాన్ని కర్నూలు శివారులో పడేశారు.తర్వాత పనిపూర్తయినట్టు తిరుమల రావుకు సమాచారం ఇచ్చారు.ఇక ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న తిరుమలరావు కోసం గాలిస్తున్నారు.