

ఈ సంఘీభావ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. సెక్రటేరియట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సీఎం తన భుజాన జాతీయ జెండా వేసుకొని పాల్గొనడం విశేషం. ర్యాలీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. టెర్రరిస్టుల దాడిలో అమరులైన సైనికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.